Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చంద్రగిరి మండలం నరసింగాపురం లోని ఆర్. ఎన్. ఆర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ సమైఖ్య దినోత్సవాన్ని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో 2014 నుంచి జరుపుకుంటున్నామని చంద్రగిరి మండల విద్యాధికారిని లలిత కుమారి తెలిపారు. వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం చెల్లాచెదురైన రాష్ట్రాలన్నింటినీ ఒకే దేశంగా తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అందుకే ఆయన జయంతిని ఏక్తా దివస్గా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి, పటేల్కు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సర్దార్ వల్లబాబ్ పటేల్ విగ్రహాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామూర్తి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశాన్ని విశాల భారతదేశంగా ఏకీకృతం చేయడంలో ఆనాటి భారతదేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్చేసిన సేవలు మరువలేనివని అన్నారు. జమ్మూ కశ్మీర్తో పాటు మరికొన్ని అఖండ భారతదేశంలో కలవగా నైజాం రాజు మాత్రం హైదరాబాద్ స్టేట్ తెలంగాణ కలపడానికి ఒప్పుకోలేదని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సంప్రదింపులు, ఒప్పందాలతోనే భారతదేశం కలవడం జరిగిందన్నారు. నడ్డి నారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారందరికి కూడా నివాళ్లు అర్పించడంతో పాటు వారిని భావితరాల వారు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యంగ సేవా సమితి అధ్యక్షురాలు నెల్లూరు మునిలక్ష్మి, పాఠశాల సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV