Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని వెంగళపల్లి గ్రామపంచాయతీలో వెలసివున్న రాజనాలబండ వీరాంజనేయ స్వామి ఆలయం లో శ్రావణమాసం మూడవశనివారం రోజున రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కి తొఃదరగా బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ రాజనాల బండ వీరాంజనేయ దేవస్థానం లో చౌడేపల్లి వైకాపా మండలాద్యక్షులు నాగభూషణ రెడ్డి ఆద్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గాలిగోపురం వద్ద నూట ఒకటి కొబ్బరి కాయలు కొట్టారు. ఈ కార్యక్రమం లో జడ్పిటీసి దామోదర్ రాజు, మాజీ యం. పి. పి రుక్మిణమ్మ, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మండల ఉపాధ్యక్షులు జంగాలపల్లి వెంకట్రమణ, దుర్గసముద్రం చెంగారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, బోయకొండ మాజీ పాలకమండలి సభ్యులు శెట్టిపేట శంకరప్ప, పవన్, సర్పంచ్ లు ఓబుల్ రెడ్డి, షామీర్, షంషీర్, చిట్రెడ్డిపల్లి కృష్ణప్ప, దుర్గసముద్రం అమరనాథ్, యం. పి. టీ. సి శ్రీరాములు, నాయకులు ఓబులేశు, సుబ్రమణ్యం రాజు, గడ్డం వారి పల్లి గిరి, ఓదులపెట సుబ్రమణ్యం, శేషాద్రి, కాగితి వెంకట్రమణ, బుటకపల్లి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV