Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎస్ వి వైద్య కళాశాలలో నాడు నేడు క్రింద వైద్య విద్యార్థుల కొరకు అధునాతన వసతులతో ఐదంతస్తుల భవనం, బోధన తరగతి గదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యను మెరుగుపరిచే క్రమంలో వైద్య విద్యార్థులకు, నాడు నేడు క్రింద సుమారు 400 కోట్లు, విలువ కలిగిన రుయా ఆసుపత్రి లో పేద రోగుల కొరకు ఆసుపత్రి బ్లాకులో, ఎమర్జెన్సీ బ్లాక్, మరియు వైద్యవిద్య అభ్యసిస్తున్న వైద్య విద్యార్థుల కొరకు సుమారు 26 కోట్లతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని ఎస్ వి.వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ భూమి పూజ చేసినారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మెగా కన్స్ట్రక్షన్ వారు ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగినది అని అన్నారు . ఈ భవనము రెండు సంవత్సరాల కాల వ్యవధి లో అనగా 2025వ సంవత్సరం పూర్తి చేసి కళాశాలకు ఇవ్వడం జరుగుతుందని, మెగా కన్స్ట్రక్షన్ వారు తెలిపారని ఆయన అన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మినిస్ట్రేషన్), డాక్టర్ వసుంధర దేవి (ఎకడమిక్ ), ఏపీ ఎం ఎస్ ఐ డి సి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీపతి రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ రమణమూర్తి, ఎస్వీ వైద్య కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు మరియు పి ఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు
Admin
Famous TV