Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తవణంపల్లి,ఏప్రిల్ 05,2023: స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు రాజగోపాల్ నాయుడు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా, తవనంపల్లి మండల, దిగువమాగం గ్రామం నందు గల రాజన్న మెమోరియల్ పార్క్ నందు శ్రీ. రాజగోపాల్ నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి,ఇందులో భాగంగా ఆయన గారాలపట్టి మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి , ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం గల్లా అరుకుమారి గారి ముద్దుల మనమడు యువ హీరో గల్లా అశోక్ కి కూడా జన్మదినం సందర్భంగా గల్లా అరుణ మరియు గల్లా రామచంద్ర నాయుడు గార్లు,గల్లా అశోక్ అభిమానులు మరియు సమీప గ్రామ ప్రజలు బారి కేక్ నీ కట్ చేసి గల్లా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపి అశోక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గల్లా అరుణ కుమారి గారు మాట్లాడుతూ నాన్న గారు మరియు అశోక్ జన్మదినం ఒకే రోజు రావటం చాలా సంతోషం గా ఉన్నది ఇద్దరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరియు అశోక్ సినీరంగంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ రాజగోపాల్ నాయుడు గారు ఎంతో మందికి మార్గదర్శి గా నిలిచారని కొనియాడారు మరియు అశోక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమం లో గ్రామస్థులు చే కోలాటాలు మరియు ఇతర సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి , ఈ కార్యక్రమం లో అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ. గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి వర్యులు గల్లా అరుణ కుమారి గారు, మండల గౌరవ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు వేణు గోపాల్ నాయుడు ,దిగువమాగం సర్పంచ్ గోపి,మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు , వైస్ సర్పంచ్ శ్రీధర్ నాయుడు మరియు గల్లా అశోక్ అభిమానులు సురేష్ ఎల్లంపల్లి తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV