Thursday, 30 July 2026 04:27:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వ్యవసాయ రంగం నిలవాలి రైతు గెలవాలని - ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

దేశంలో రైతు ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది

Date : 13 June 2023 05:31 PM Views : 728

Famous TV - ఆంధ్రప్రదేశ్ / పల్నాడు ( నరసరావుపేట ) : వ్యవసాయ రంగం వర్తమానం- భవిష్యత్తు పై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిటోరియంలో అఖిలపక్షాల భేటీ జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం నిలవాలి రైతు గెలవాలి అనే నినాదంతో వ్యవసాయ రంగం వర్తమానం- భవిష్యత్తు పై మంగళవారం నాడు అఖిలపక్షాలతో కలిసి రైతు సంఘ నాయకులు,భారత కమ్యూనిస్టు పార్టీ నరసరావుపేట ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో చర్చ గోస్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ......జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ అవస్థ పడుతున్నాయని ఇన్పుట్ సబ్సిడీలను ఎత్తి వేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని డా౹౹చదలవాడ విమర్శించారు.జగన్మోహన్ రెడ్డిది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వ్యాపారులతో కుమ్మక్కై సబ్సిడీలను ఎత్తి వేసి విత్తనాలు,ఎరువులు ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా దళారీ వ్యవస్థతో చేతులు కలిపి రైతుల పండించిన పంటలకు కనీసం మద్దతు ధర లేకుండా రైతుల నోర్లు కొడుతున్నారని ఆరోపించారు.ఈ క్రాప్ నమోదు చేయకుండా అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందకుండా రైతు ఆత్మహత్యలను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సాగర్ కుడి కాలువ 126 కిలోమీటర్లు మేర పూడిక ఏర్పడి కలవర్టులు కొట్టుకుపోయాయని,కాలువలో చెట్లు పెరిగి రైతులకు కాలువ నీళ్లు అందడం లేదని ఈ విషయం పై ఇరిగేషన్ అధికారులు,ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సీఎం జగన్ రెడ్డికి చలనం లేదని ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్లు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు,రైతు నాయకులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :