Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. కార్మికుల శ్రమ సంస్థలకు శ్రీరామరక్షని కార్మిక యూనియన్ ఎంప్లాయిస్ యూనియన్ కి అన్నివేళలా అండదండగా నిలుస్తామని ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఎంప్లాయిస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమం కు ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి యూనియన్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. అనంతరం 72వ ఆవిర్భవ దినోత్సవ కేకును కట్ చేసి కార్మిక నాయకులకు పంచారు. ఎంప్లాయిస్ యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే ఏ సంస్థ అయినా మనుగడ సాగిస్తుందని, ఆర్టీసీ సంస్థ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కార్మికుల కష్టాలతోనే మనుగుడా సాగిస్తుందని గుర్తు చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ ఎల్లవేళలా కార్మికుల కోసం పనిచేస్తుందని,ఎంప్లాయిస్ యూనియన్ కి తాము సంపూర్ణ అండదండలు అందించి ఎంతటి ఒత్తిళ్లు ఎదురైనా ఎంప్లాయిస్ యూనియన్ పక్షాన నిలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎన్ వి ఎస్ బాబు మృతికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిపో కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసకుమార్,నరసింహులు, సి వి బేబీమాధవ,రోశయ్య,జి,పి,ఎస్,ఆచారి,చంద్ర,గంగాధరం,రాజ్కుమార్, సెల్వ, ఉదయ,rss రెడ్డి, సుబ్బయ్య, మురళి, బాలాజీ, కటయ్య, వెంకటేశ్వరులు, మరియు మహిళా నాయకులు పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, బాల్ శెట్టి నరసింహులు, సుందరష్, బాల గౌడ్, ప్రసాద్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV