Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చౌడేపల్లి పర్యటన సందర్బంగా పట్టణంలోని బోయకొండ ఆర్చివద్ద బారీగా మోహరించిన కార్యకర్తలు, చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబురెడ్డి)రొంపిచెర్ల నుండి పులిచెర్ల, సదుం, సోమలపై చౌడేపల్లి చేరుకున్నారు. చౌడేపల్లి బోయకొండ గంగమ్మ ఆర్చి వద్ద చౌడేపల్లి నాయకులు పతిరాజు, ప్రదీప్ రాజు,ఆవుల రామచంద్ర, పవన్,కార్తీక్, హరిరాయల్,ఏలూరి సుబ్రమణ్యం తదితరులం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఆయన అందరిని క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా పుదిపట్ల,చదళ్ళ మీదుగా కాటిపేరి చేరుకన్నారు. కాటిపేరి నాయకులు భారీ బాణసంచా పేల్చి స్వాగతం పలికారు.అనంతరం కాటిపేరి గ్రామంలో గల గ్రామ దేవత బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరః భాస్కర్ నాయుడు, వెంకట రెడ్డి, కమార్ రెడ్డి, నివాసాలవద్ద అల్పాహారం సేకరించారు.అటునంచి గిరిజా పురం నుండి అగస్తిగాని పల్లికి వెళ్లి గంగాధరం ఇటివద్ద అల్పాహారం చేశారు. అనంతరం యనమసామన పల్లి కి చేరుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంజా నాగరాజ రెడ్డి ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రాజు,లక్షణరాజు(పతిరాజు)యువనాయకుడు కార్తీక్, ఆవుల రామచంద్ర,ఆవుల పవన్,సింగిల్ విండో చైర్మన్ హరిప్రసాద్ రాయల్,ఏలూరి సుబ్రమణ్యం,సాగర్ నాయుడు, సుధాకర్ నాయుడు,బోయకొండ శివన్న, రామకృష్ణ,గంపల గంగరాజు,కాగితి రామకృష్ణ, మండలం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV