Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాళహస్తి తిరుపతి మధ్య పరిసర ప్రాంతాళలో బ్రిటిష్ దేశానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారితో చర్చలు జరిపారు.రేణిగుంట ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అలాగే ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉండడం వలన అన్ని విధాల అనుకూలమని తెలిపారు .అందుకు సంబందించిన వీడియోని వారికి చూపిస్తూ వివరించారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాదులో మరో సమావేశం ఏర్పాటు చేసి మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకనామి అడ్వైజర్ నళిని రఘురామన్, ఓడూరు గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV