Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏఐటియుసి తిరుపతి జిల్లా ప్రధమ మహాసభలు కాళహస్తి పట్టణంలో డిసెంబర్ 17 ,18, 19 తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభ జయప్రదం కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘం కరపత్రాలను గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రం పోరాటాల గడ్డ కాళహస్తిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలు జరపడం చాలా శుభ పరిణామo కాళహస్తి నియోజకవర్గం లో అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న యావత్తు కార్మిక వర్గం కార్మిక నాయకులు కార్మిక వర్గ శ్రేయోభిలాషులందరూ ఈ యొక్క మహాసభలు జయప్రదాయాన్ని కృషి చేయాలి అని అలాగే మహాసభల విజయవంతానికి నా వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తానని మహాసభలు దిగ్విజయంగా జయప్రదం కావాలి అని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి గారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారికి ఆఫీస్ బేరర్స్ కు శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఏఐటియుసి నాయకులందరికీ ఆయన అందించారు తర్వాత సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య లు మాట్లాడుతూ కాళహస్తి పట్టణంలో డిసెంబర్లో మూడు రోజులపాటు ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలు జరుగుతున్నాయని ఈ మహాసభల జయప్రదానికి యావత్తు కార్మిక వర్గం కృషి చేయాలని గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చేసిన పోరాటాలు సాధించిన విజయాలు జరిగిన లోపాలను సమీక్షించుకొని రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్మిక వర్గ పోరాటాలకు ఈ మహాసభల్లో రూపకల్పన చేయడం జరుగుతుందని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఈ మహాసభల జయప్రదానికి కార్మిక వర్గం యావత్తు కదలి రావాలి అని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమo లో ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బేరర్స్ వైఎస్ మణి. ఎన్ డి రవి .సి హెచ్ శివ కుమార్ .చంద్రశేఖర్ రెడ్డి .నాగేంద్ర. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హేమావతి చాముండేశ్వరి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మహేంద్ర స్కూల్ స్వీపర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుశీల లాజరస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు మురళి మోహన్ రెడ్డి కార్తీక్ పాల్గొన్నారు.
Admin
Famous TV