Wednesday, 04 March 2026 02:18:41 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రధమ మహాసభలు జయప్రదం చేయండి

ఆహ్వాన సంఘం కరపత్రాలను విడుదల చేసిన-(ఎమ్ ఎల్ ఏ)- బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 24 November 2023 03:10 PM Views : 537

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏఐటియుసి తిరుపతి జిల్లా ప్రధమ మహాసభలు కాళహస్తి పట్టణంలో డిసెంబర్ 17 ,18, 19 తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభ జయప్రదం కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘం కరపత్రాలను గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రం పోరాటాల గడ్డ కాళహస్తిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలు జరపడం చాలా శుభ పరిణామo కాళహస్తి నియోజకవర్గం లో అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న యావత్తు కార్మిక వర్గం కార్మిక నాయకులు కార్మిక వర్గ శ్రేయోభిలాషులందరూ ఈ యొక్క మహాసభలు జయప్రదాయాన్ని కృషి చేయాలి అని అలాగే మహాసభల విజయవంతానికి నా వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తానని మహాసభలు దిగ్విజయంగా జయప్రదం కావాలి అని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి గారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారికి ఆఫీస్ బేరర్స్ కు శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఏఐటియుసి నాయకులందరికీ ఆయన అందించారు తర్వాత సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య లు మాట్లాడుతూ కాళహస్తి పట్టణంలో డిసెంబర్లో మూడు రోజులపాటు ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలు జరుగుతున్నాయని ఈ మహాసభల జయప్రదానికి యావత్తు కార్మిక వర్గం కృషి చేయాలని గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చేసిన పోరాటాలు సాధించిన విజయాలు జరిగిన లోపాలను సమీక్షించుకొని రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్మిక వర్గ పోరాటాలకు ఈ మహాసభల్లో రూపకల్పన చేయడం జరుగుతుందని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఈ మహాసభల జయప్రదానికి కార్మిక వర్గం యావత్తు కదలి రావాలి అని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమo లో ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బేరర్స్ వైఎస్ మణి. ఎన్ డి రవి .సి హెచ్ శివ కుమార్ .చంద్రశేఖర్ రెడ్డి .నాగేంద్ర. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హేమావతి చాముండేశ్వరి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మహేంద్ర స్కూల్ స్వీపర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుశీల లాజరస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు మురళి మోహన్ రెడ్డి కార్తీక్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :