Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : హాస్య కథలు పాఠకులకు దివ్యౌషధంగా పని చేస్తాయని ఎస్వీ పశువైద్య వర్శిటీ విసి జంపాల వెంకట రమణ చెప్పారు. ఆదివారం జెసిఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో జరిగిన మీది తెనాలి మాది తెనాలి పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ హాస్య పూరిత సందేశం మార్పుకు శ్రీకారం చుట్టుతుందన్నారు. రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజు కృషిని పలువురు ప్రశంసించారు. హద్యానంద మాస పత్రిక సంపాదకులు పి రాము, భాషావేత్త ఆచార్య మూలే విజయలక్ష్మి, సి పి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతగుంట శివారెడ్డి సమాజంలో సాహిత్య ప్రభావాన్ని గూర్చి ప్రసంగించారు. జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు శేష సాయి, కార్యదర్శి దిలీప్ కుమార్, కోశాధికారి దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV