Wednesday, 04 March 2026 02:16:03 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

సముద్రంలో చేపలవేటకు వెళ్ళరాదు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్దంగా వుండాలి.

అధికారులు సెలవుల్లో వుంటే వెంటనే విధుల్లోకి చేరాలి : జిల్లా కలెక్టర్

Date : 02 December 2023 04:40 PM Views : 552

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, డిసెంబర్ 02: తుఫాన్ చెన్నై –నెల్లూరు మధ్య తుఫాన్ తీరందాటే అవకాశం వుందని పడమట దిశగా మారితే ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, పునరావాస ఏర్పాట్లు సిద్డంచేయాలని ప్రభుత్వ అధికారులు , సిబ్బంది సెలవుల్లో వుంటే వెంటనే విదుల్లోచేరి అందుబాటులో వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.           శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అధికారులతో , డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావంపై జిల్లాలో అధికారులు చేపట్టాల్సిన పనులపై కలెక్టర్, జెసి డి కె బాలాజీ  పలు సూచనలు చేసారు.           జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావం ఈ నెల 3,4,5 జిల్లాలో ప్రభావం వుందని, ఇప్పటికే జిల్లా లో వర్షాలు పడుతున్నాయి,  తుఫాన్  వల్ల మరింత ప్రభావం ఉంటుందని అప్రమత్తంగా  వుండాలని అన్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది స్థానికంగానే 24 గంటలు అందుబాటులో వుండాలి అన్నారు. డివిజన్ స్థాయి లో ఆర్డిఓ లు , డి ఎస్ పి లు తమపరిధిలో ఎలాంటి మానవ , పశు సంపద నష్టం జరగకుండా ప్రణాలికలు , హెచ్చరికలు జారీచేయాలని డివిజన్, మండల స్థాయ్లి కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు కావాలని ఇప్పటికే తెలిపామని అన్నారు.   ప్రభావిత ప్రాంతాలు ఈ రోజే  పర్యటించి అవసరమున్న చోట చేపట్టాల్సిన పునరావాస కేంద్రాలు , లోతట్టు ప్రాంతాల వారిని గుర్తించి అప్రమత్తం చేయాలని అన్నారు. పునరావాస కేంద్రాలల్లో అన్నివసతులు వుండేలా చూడాలని అన్నారు. మండల స్థాయిలో తహసిల్దారులు ఎస్.హెచ్ .ఓ.లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. పెట్రో ల్ బంకు లో డీజల్, పెట్రోల్ అత్వసర పరిస్థిల్లో స్టాక్ ఉండేలా చూడాలని, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో వుండాలని అన్నారు.  గ్రామాల్లో , పట్టణాల్లో డి పి ఓ, మునిసిపల్ శాఖలు నేడే మురికి కాలువలు పూర్తి స్థాయిలో శుబ్రపరచాలి, నీటిపారుదల శాఖ త్రాగునీటి ట్యాంకుల సుబ్రపరిచి నిరంతరం నీటిని నింపేలా , త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రహదారులకు సంబంధించి పంచాయితీ రాజ్ , ఆర్  అండ్ బి శాఖలు , ఇరిగేషన్ శాఖ ఇప్పటికే జిల్లాలో వర్షాలు పడుతున్నాయి చెరువులు, వాగులు, వంకల వద్ద సిబ్బంది నియమించి పర్యవేక్షించాలి అన్నారు. పశుసవర్తక శాఖ ఫీడ్ , పాడర్ , మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పిహెచ్ సిలు, సిహెచ్ సి లు 24 గంటలు అందుబాటులో వుండాలి అన్నారు. పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు కావాలని అన్నారు. విద్యుత్ శాఖ అంతరాయం లేకుండా చూడాలని ఇబ్బందులు తలెత్తే వెంటనే పునరుద్ధరణ జరగాలని అన్నారు. చేపలవేట కు వెల్లినవారిని నిన్ననే తిరిగి రమ్మన్నాం, వచ్చారు అంటున్నారు మరోసారి మత్స్యశాఖ పరిశీలించాలి అన్నారు.           జేసి మాట్లాడుతూ జిల్లాలో రేషన్ పంపిణీ జరుగుతున్నది, ఎం.డి.యు.లు రెండురోజుల్లో పూర్తీ చేసేవిధంగా కొద్ది సమయం ఎక్కువగా కేటాయించి పంపిణీ చేయాలి, తుఫాన్ ప్రభావంతో రేషన్ అందలేదని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడండి అన్నారు. జిల్లా కలెక్టరేట్ నుండి  డి ఆర్ ఓ పెంచల కిషోర్ , జిల్లా అధికారులు పాల్గొనగా డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :