Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : గురువారం ఎస్వీ వైద్య కళాశాల లో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జె వి. జగన్నాథ్ దీక్షిత్, ప్రొఫెసర్, సామాజిక వైద్య విభాగం, బి జె. ప్రభుత్వ వైద్య కళాశాల, పూణే మహారాష్ట్ర నుండి గెస్ట్ స్పీకర్ గా రావడం జరిగినది. వైద్య అధ్యాపకులకు, వైద్య విద్యార్థులకు, మరియు వైద్య సిబ్బందికి , ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి నుండి ఊబకాయము నుండి కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటామో, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి శరీరం సహకరిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యముగా కొన్ని వ్యాయామములు, నడక, మరియు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను, తీసుకున్నప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలము అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెళ్లి డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్,పూణే , ఆగస్టు నెల 16 నుండి సెప్టెంబర్ 7 వరకు వివిధ ప్రభుత్వ కళాశాల లో అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. దక్షిణ భారతదేశంలో మధుమేహము, ఊబకాయము పెరగడం వల్ల ప్రజలు అనారోగ్య పాలు వుతున్నారని, డాక్టర్ దీక్షిత్ పరిశోధనలో తెలిపారు. భారత ప్రభుత్వం తరఫున కొన్ని అవగాహన కార్యక్రమాలు జరిపించడం అవసరం ఉందని అన్నారు . ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకొనడం వలన , కొంతవరకు మెరుగైన జీవితాన్ని గడపడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇటు వైద్యులకు, వైద్య విద్యార్థులకు మరియు వైద్య సిబ్బందికి . ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అప్పుడప్పుడు నడిపినట్లయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చునని మధుమేహము, ఊబకాయము లేని భారతదేశాన్ని మనం నిర్మించుకోగలమని ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు , ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ సునీత, డాక్టర్ ఆది నటేష్, వైద్యులు వైద్య విద్యార్థులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV