Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : AP: గుంటూరు :తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రాజెక్టుల పరిశీలనకై శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తుండగా.. అక్కడకు భర్తతో కలిసి వెళ్లి చంద్రబాబుతో శ్రీదేవి సమావేశమయ్యారు. కాగా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ శ్రీదేవిని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆమె టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
Admin
Famous TV