Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పూతలపట్టు , 16.03.2024: ఈరోజు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ సంస్థ కి చెందిన మహిళల బృందం అమర్ రాజా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారి స్వగ్రామైన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పెట్టమట్ట గ్రామం ని సందర్శించారు, ఇందులో భాగంగా రామచంద్ర నాయుడు గారు స్వగ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయిన అమరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెంటర్, ఉచిత ఆరోగ్య కేంద్రం, స్కూల్స్ ,కళాశాలలు, నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరాముల వారి ఆలయం మరియు మరి ఇతర అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన ఇష్టాగోష్టి లో గల్లా రామచంద్ర నాయుడు గారు వారి ప్రస్థానాన్ని కులంకషంగా వారికి వివరించారు. అనంతరం మహిళల బృందం డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు తన స్వగ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినందుకుగాను వారు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ సంస్థ కి నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన అమర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరీనేని గారిని సన్మానించారు. చివరగా నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ చైర్మన్ డాక్టర్ రమాదేవి గౌరీ గారు మరియు వారి బృందం శశిబిందు, శ్రీదేవి,సరిత, అనుపమ,కోమల, సులోచన ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Admin
Famous TV