Famous TV - ఆంధ్రప్రదేశ్ / : సోమవారము: రాష్ట్ర ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి బ్రాంచ్ సర్వసభ్య సమావేశం వీరకిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం గుంటూరులో జరిగిన 18వ రాష్ట్ర మహాసభల లో రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏటుకూరి గిరిబాబు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నికైన కే సి సుబ్రహ్మణ్యం, వీర కిరణ్ ను ఘనంగా సత్కరించిన ఎస్ వి వైద్య కళాశాల వైద్య సిబ్బంది మరియు నాలుగో తరగతి సిబ్బంది. ఈ సందర్భంగా ఏ గిరిబాబు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గుంటూరులో జరిగిన 18 రాష్ట్ర మహాసభలు లో అనేక తీర్మానాలు తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు వాటిలో ప్రధానంగా కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేయాలని,సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు కి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, 12వ పి ఆర్ సి నందు ఇంటీరియమ్ రిలీఫ్ 36% మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి నగర ఎన్జీవో అధ్యక్షులు సిరిమామిళ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని 71 సంవత్సరాలుగ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ పోరాడి సాధించిందని అంతటి ఘనమైన చరిత్ర ఉన్న సంఘానికి రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం గిరిబాబు పటిష్ట నాయకత్వానికి గుర్తు అని అభినందించారు. రెండవ శనివారం పనిచేసిన ఉద్యోగులకు సిసిఎల్ లీవ్ మంజూరు చేయాలి. ఈ కార్యక్రమంలో , బ్రాంచ్ కోశాధికారి బాలసుబ్రమణ్యం, వైస్ ప్రెసిడెంట్ రాజలక్ష్మి, ఆస్థాన బేగం, భక్తవత్సలం, సిద్ధారెడ్డి, గిరి కుమార్, లోకేష్ మురళి, కూర కాలువ మురళి,ఏపీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి మహేంద్ర శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాత, కిరణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV