Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నారు. ఈరోజు, ఆగస్ట్ 12, 2023 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు 2 విభాగాలకు పోటీలు నిర్వహింపబడినది చిన్నపిల్లలు : 1-4వ తరగతి విద్యార్థులకు. జూనియర్స్ : 5 - 7వ తరగతి విద్యార్థులకు. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, కడప, అన్నమయ్యకు చెందిన సుమారు 39 పాఠశాలల నుంచి అనేక మంది విద్యార్థులు పోటీలో చురుకుగా పాల్గొన్నారు. రేపు, ఆగస్ట్ 13, 2023 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీనియర్స్ విభాగాo, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్ పోటీ నిర్వహించబడుతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, చిత్రలేఖనను పైన ఇచ్చిన అంశం పై మాత్రమే చేయాలి. వేదిక: ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్ సర్టిఫికేట్-లను 15 ఆగస్టు, 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, రాయలసీమ మిమిక్రీ మ్యాజిక్ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, ముని లక్ష్మి,వినయ్ కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Admin
Famous TV