Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా,బంగారుపాళ్యం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన వస్తున్న విషయం తెలిసిందే ,ఐతే సదరు గిట్టుబాటు ధర కల్పించాలనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చౌడేపల్లి మండలం లో గల వైకాపా నేతలు ఆదివారం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక జడ్ పి టి సి నడింపల్లి దామోదర్ రాజు అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ నుంచి కార్యకర్తలు విధిగా హాజరుకావాలని ,ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైకాపా మండలాధ్యక్షులు నాగభూషణం రెడ్డి,మాజీ యంపి.పి.రుక్మీణమ్మ, సర్పంచులు కృష్ణారెడ్డి,ఓబుల్ రెడ్డి,జాకీర్,వైస్ యం.పి.పి సుధాకర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి,మాజీ బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ,జంగాలపల్లి వెంకటరమణ,ఓదులపేట సురేంద్ర రెడ్డి, సుబ్రమణ్యం,శంకర్ రెడ్డి,బోయకొండ గంగిరెడ్డి,హరినాథ్,రెడ్డెప్ప రెడ్డి,పరికిదొన బాబు,చాలాకాలం ముదిరాజ, రమణారెడ్డి, రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV