Famous TV - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయనను సీబీఐ ప్రశ్నించగా.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ గురించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై స్పీకర్ తమ్మినేని సీతారం సీరియస్ అయ్యారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. దర్శనం కోసం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న స్పీకర్ సీతారాంకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ్మినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో పేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా తీర్ధప్రసాదాలను స్పీకర్ తమ్మినేనికి ఆలయ అధికారులు అందించారు.
Admin
Famous TV