Monday, 14 September 2026 06:14:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు

Date : 10 June 2026 09:07 PM Views : 1233

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని కొన్ని పంచాయతీలలో మహిళలు అధిక వడ్డీ ఐదురూపాయలు, పది రూపాయల కు ఆశపడి లక్షల్లో అప్పులిచ్చి, మోసపోయిన సందర్బాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా అధిక వడ్డీకి నగదు తీసుకొనే వారు ఖాళీ ప్రామిసరీ నోట్లపైన సంతకాలు చేయించుకొని డబ్బులు అప్పుగా ఇస్తున్నారు.ఈ క్రమంలో గత పరికిదొన,నూనెముద్దల పల్లి, సింగిరి గుంట, మొడుకూరు,దొనపల్లి,చౌడగానిపల్లి,చారాల, దుర్గసముద్రం,పెద్దకొండామర్రి, కాగతి, యల్లంపల్లి, కాటిపేరి,పుదిపట్ల,లద్దిగం,ఆమినిగుంట,చౌడేపల్లి వంటి గ్రామాలలో పదిహేను రోజులకు వడ్డి కూడా చెల్లించాలి.ఈ విధంగా వడ్డీ వ్యాపారంతో అధిక వడ్డీ చెల్లించలేక ఎందరో తమ విలువైన భూములు,ఆభరణాలు వదులుకుంటున్నారు. చాలా గ్రామాలలో ఖాళీ పత్రాలు దర్శనమిస్తున్నాయి.ఈ నేపత్యంలో గత రెండురోజుల క్రితం కూడా రెండు వర్గాలు కొట్టుకున్న దాఖలా కూడా ఉంది. వారిని మా ప్రతినిధి విచారించగా దిమ్మతిరిగే నిజాలు భయటపడ్డాయి. నూటికి పదిహేను రోజులకు ఐదురూపాలు వడ్డి, ప్రతి పదిహేను రోజులకు ఖచ్చితంగా చెల్లించాల్సిందే,అలా కాకపోతే ఇండ్లు,పొలాలు,వాహనాలు లాక్కుంటారు.అంతే కాకుండా ఇటువంటి వడ్డీ వ్యాపారులకు అప్పనంగా డబ్బులు వస్తాయి కాబట్టి వారు రౌడీషీటర్లను,రాజకీయ నాయకులను బాగా మేపుతున్నారు. వాళ్ళకు వడ్డీ లేకుండా పైకము ఇచ్చి వసూళ్ళకోసం వీళ్ళ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు.మండలం లో ఒకే కుటుంబం సుమారు ఎబ్బైలక్షలు అప్పులు ఇచ్చినది అంటే వారికి ఆదాయం ఎలా ఉందో ఆలోచించండి. ఆదాయపు పన్ను అధికారులు ఇటువంటి వాళ్ళ ఇళ్ళలో ఎఃదకు సోదాలు చేయడంలేదు.వాళ్ళ బంధువులు, నమ్మకస్తులు,ఇండ్లలో,వారి ఫోన్ కాల్ డేటా కల్గిన వారి ఇండ్లలో ఒక్కసారిగా సోదాలు నిర్వహిస్తే ఎఃతమఃది బయటపడుతారో.కాబట్టి ఇటువంటి వారికి లైసెన్స్ కూడా ఉండదు. ఇటువంటి వారిపైన అధికారులు సోదాలు నిర్వాహించాలని పలువురు అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :