Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : వైకాపా ను బలోపేతం చేయడానికి గ్రామస్థాయి కమిటీలు వైకాపా మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : గ్రామస్థాయి నుంచి వైకాపాను మరింత బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలను నియమిస్తున్నట్లు వైకాపా పార్టీ చౌడేపల్లి మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని పెద్ద కొండమర్రి, వెంగళపల్లి, గడ్డం వారి పల్లి, పంచాయతీలయందు వైకాపా నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా నాగభూషణం రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు చౌడేపల్లి మండలంలోని అన్ని పంచాయతీలలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న నినాదంతో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలియపరుస్తున్నారు. చౌడేపల్లి మండల నాయకుల అండదండలతో పెద్ద కొండా మరి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల అధ్యక్షుని పదవి బాధ్యతలు ఇచ్చినందుకు మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి నెరవేర్చకున్న కనీసం రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో మన ఇంట్లో ఉన్న మాదిరిగా రైతు భరోసా కేంద్రాల యందు యూరియాని స్టాక్ ఉంచడం జరిగిందన్నారు.పెద్ద కొండ మర్రి పంచాయతి ప్రజల ఆశీస్సుల వల్లే నాకు మండలాధ్యక్షుడు పదవి వచ్చిందని ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కొండా మరి గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ ఎన్నికైన వారిని శాలువతో సన్మానించి పూలమాల వేశారు కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల వైకాపా నాయకులు రాష్ట్ర వైసీపీ ఉపాధ్యక్షుడు చౌడేపల్లి జెడ్పిటిసి నడింపల్లి దామోదర్ రాజు వైస్ ఎంపీపీలు సుధాకర్ రెడ్డి మాజీ జడ్పిటిసి రుక్మిణమ్మ మాజీ బోయకొండ చైర్మన్ మిద్దిన్టి శంకర్ నారాయణ మాజీ సింగల్ విండో అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి సర్పంచులు జయసుధమ్మ , సంbషీర్, దొనపల్లి వెంకటరెడ్డి, జంగాలపల్లి రమణ, వెంగళపల్లి శేఖర, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
Famous TV