Wednesday, 29 July 2026 03:09:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

Date : 05 February 2026 09:13 PM Views : 781

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా గగనతలం నుండి ఖాకీ నిఘా: డ్రోన్ కెమెరాల సహాయంతో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి! ????13 మంది జూదరుల అరెస్ట్ – పందెం కోళ్లు, నగదు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మదనపల్లి, ఫిబ్రవరి 05: అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గుండెల్లో జిల్లా పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,* అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా, డ్రోన్ కెమెరాల నిఘాతో బోయకొండ పరిసరాల్లో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాన్ని పోలీసులు రట్టు చేశారు. *స్కై-ఐ నిఘాతో గుట్టు రట్టు* మదనపల్లె డీఎస్పీ శ్రీ ఎస్. మహేంద్ర గారికి అందిన పక్కా సమాచారం మేరకు, చౌడేపల్లి మండలం బోయకొండ లోని వి.కె. రెసిడెన్సీ వెనుక భాగంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. పందెం రాయుళ్లు పోలీసుల రాకను గమనించి తప్పించుకోకుండా ఉండేందుకు, పోలీసులు తొలుత డ్రోన్ కెమెరాలను గగనతలంలోకి పంపి నిఘా పెట్టారు. పందాలు జరుగుతున్న ప్రదేశాన్ని, నిందితులను డ్రోన్ దృశ్యాల ద్వారా గుర్తించిన అనంతరం, డీఎస్పీ గారి నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆకస్మిక దాడి నిర్వహించింది. *స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు* ????అరెస్టులు: 13 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ????నగదు: పందెం సొమ్ము రూ. 25,000/- నగదు స్వాధీనం. ????పందెం కోళ్లు: 06 కోడి పుంజులు. ????సెల్ ఫోన్లు: నిందితుల వద్ద ఉన్న 13 మొబైల్ ఫోన్లు. ????వాహనాలు: పందాల కోసం వాడిన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేసినట్లు చౌడేపల్లి ఎస్ఐ నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :