Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువపల్లిలో వేలసియున్న బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఆద్వర్యములో గురువారం రెండవ రోజు అత్యంత వైభవముగా లక్ష కుంకుమార్చన కార్యక్రమము ప్రారంభించబడినది. సదరు లక్ష కుంకుమార్చన కార్యక్రమములో ఉభయదారులుగా 332 మంది దంపతులు పాల్గొని వారి అభీష్టసిద్ది కొరకు పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులు అయినారు.అమ్మవారి దర్శనమునకు విచ్చేసిన ఉభయదారులకు మరియు భక్తాదులకు ఉచిత అన్నదానము చేయడము జరిగినది. వీరికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.గత మూడు రోజులుగా జరుగుతున్న లక్ష కుంకుమార్చన లో మొత్తం 562 మంది దంపతులు ఉభయధారులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు ఏకాంబరం, అర్చకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV