Monday, 02 March 2026 12:22:47 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం

Date : 08 February 2026 07:39 PM Views : 451

Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,దిగువపల్లి గ్రామపంచాయతీలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం,భక్తుల కోర్కెలు తీర్చే కల్పవళ్ళి బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఇటు ఆంద్రప్రదేశ్ అటు కర్ణాటక,తమిళనాడు లనుండి భక్తులు అధికంగా వచ్చారు,భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు.ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్ళి ప్రసాదాలు తీసుకొనే విధముగా సిబ్బందిని ఆదేశించారు,అమ్మవారి బలిపీఠము వద్ద జంతుబలులను,అక్కడ గల సౌకర్యాలను,అలాగే తలల వేలం పాటవద్ద గల భక్తులతో చర్చించి,వేలం పాట సవ్యంగా జరుగుతున్నదా లేదా అనేవిషయాలపై,సిబ్బంది భక్తులతో మాట్లాడుతున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు,కళ్యాణ కట్ట వద్ద భక్తులకు తలనీలాలు సమర్పించే భక్తులు టికెట్టు ద్వారానే తలనీలాలు సమర్పించాలనీ,ఎవరికీ అధనంగా పైకము చెల్లించవద్దని భక్తులకు తెలియజేశారు,కళ్యాణ కట్ట లో ఎవరైనాసిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కార్యాలయం దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కళ్యాణ కట్ట సిబ్బందిని హెచ్చరించడం జరిగింది,అంతే కాకుండా అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణం లో జేబుదొంగలున్నారని,తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు,ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా,ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రం లో సంప్రదించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆయన వెంట సూపరింటెండెంట్ రామనాథం,సుధాకర్ రెడ్డి,మణి తదితరులు ఉన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :