Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం, దిగువపల్లిలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ పాదాల చెంత గల షాపింగ్ కాంప్లెక్స్ నందు వేలం పాటలో కొనుగోలు చేసిన షాపు యజమానులు తమ షాపుల ముందుగల పుట్ పాత్ ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఇదిలా ఉండగా షాపు యజమానులు పూర్తిగా పుట్ పాత్ ను ఆక్రమించుకొని, భక్తులు,యాత్రికులు నడవడానికి కూడా వీలులేకుండా చేశారు. దీనికి తోడు ద్విచక్రవాహన దారులు, కార్లు రోడ్లపైనే పార్కింగ్ చేయడం వలన భక్తులు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు పైనే నడుస్తున్నారు. గతం లో కూడా ఇలానే ఉండగా అప్పటి ఈఓ పుట్ పాత్ పైన ఎవరు వస్తువులు పెట్టకూడదని ఆంక్షలు విధించడం జరిగింది. ఐతే ప్రస్తుతం పుట్ పాత్ పూర్తిగా ఆక్రమించుకొని షాపులు రోడ్డు వరకు విస్తరించడం వలన అటు ప్రజలు, భక్తులు, ఇటు యాత్రికులు ఇబ్బందులు పడుచున్నారు. అంతే కాకుండా రోడ్డు వరకు షాపులు ఉండటం వలన ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. కావున సంబందించిన అధికారులు షాపు యజమానులతో మాట్లాడి పుట్ పాత్ ను పూర్తిగా పాదచారులకోసం కేటాయించే విధముగా చేయాలని భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Admin
Famous TV