Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి చిన్నతనంలో చిలిపి చేష్టలతో అటు ఉపాద్యాయులతో, ఇటు స్నేహితులతో మమేకమై పాఠశాల విద్య అంటే మొదటి సారి రుచిచూసిన ప్రాథమిక పాఠశాలలో జ్ఞాపకాలు పంచుకుంటే ఎలా ఉంటుందో తెలియని వయస్సులో చేసిన మధుర జ్ఞాపకాలు పంచుకుంటుంటాము. అలాంటి అద్బుత సన్నివేశమే బుదవారం చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామపంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు కేశవ రెడ్డి, తిరుమలమ్మ ముఖ్యఅథితులుగా హాజరైనారు.ఐదవ తరగతిలో ఇరవై మంది విద్యార్థులకు వీడ్కోలు సమావేశం వారి జవన గమ్యంలో గుర్తుండిపోయే విధముగా చేశారు. భారీ కేక్ కట్ చేసి, విద్యార్థులు నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ పాఠశాల చరిత్ర ను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వివరించారు. పూజాకార్యక్రమం అనంతరం అందరూ బాగా చదువుకొని, మన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని వారు ఆశిర్వదించారు.విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మినారాయణ ప్రసాద్, గణేష్, సుబ్రమణ్యం, వసంత, స్రవంతి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV