Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతిలోని యూత్ హాస్టల్, తిరుపతిలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో కేవలం 6 సంవత్సరాల వయస్సు కలిగిన మేధస్వి. కె అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించడం విశేషంగా నిలిచింది. మొత్తం మూడు రౌండ్లుగా నిర్వహించిన ఈ పోటీల్లో మేధస్వి. కె 3 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో మహాలక్ష్మి. ఎస్ ద్వితీయ స్థానం, మనస్వి రెడ్డి తృతీయ స్థానం దక్కించుకున్నారు. అలాగే సురేపల్లి భువిక రాజ్, వి. నీక్షిత, ఏ. దివ్యానంత్ కృష్ణ కూడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మేధస్వి. కె ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో ట్రైనర్ శ్రీ వి. బాలాజీ చౌదరి గారి శిక్షణ కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయస్సులోనే చెస్పై ఆసక్తిని పెంపొందించి, క్రమశిక్షణతో శిక్షణ అందించినందుకు ట్రైనర్ వి. బాలాజీ ప్రశాంత్ చౌదరి గారిని అందరూ అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో మేధస్వి. కె సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
Admin
Famous TV