Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె 8 ఏళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్య పై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తరాది గీత తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం ఆ కుటంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గంజాయి మత్తులో ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి కఠినమైన శిక్ష వేయాలి అని ,మరో సారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఇలాంటి వారికి చట్టంలో కఠిన చర్యలు ఉండేలా సవరణలు తీసుకొని రావాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆడపిల్ల రక్షణ కోసం తల తీసేసే చట్టాలు తీసుకోస్తాం అన్న నాయకులు ప్రస్తుతం ఏమయ్యారని ప్రశ్నించారు.గంజాయి, బెల్టుషాపులు అధికం అవటం వళ్లనే రాష్టంలో మహిళల పైన అఘాయిత్యాలు చేస్తున్నారని.ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను, మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించాలని, ఇటువంటి మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించడం వలన ఇంకోక్కసారి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు భయపడి చావాలని అన్నారు. ఇటువంటి సంఘటన ల పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి వారం, పదిరోజులలో నిందితుని భహిరంగంగా ఉరితీయాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీతహరిప్రసాద్ అన్నారు.
Admin
Famous TV