Wednesday, 29 July 2026 12:14:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు –

Date : 11 May 2026 07:26 PM Views : 1181

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ తీవ్రంగా విమర్శించారు.చౌడేపల్లి మండలం, ఎగువ మల్లెవారిపల్లిలో క్రికెట్ ఆడుతూ 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హరిబాబు యాదవ్ మాట్లాడుతూ వ్యవస్థల వైఫల్యం: "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోతే,ఆ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ గానీ, వాహన సౌకర్యం గానీ లేక స్నేహితులు బైక్‌పై తీసుకువెళ్లడం చూస్తుంటే మనం 2026లో ఉన్నామా? లేక 1970ల నాటి చీకటి రోజుల్లో ఉన్నామా? అనిపిస్తోంది."అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సూటి ప్రశ్న: అభివృద్ధి అంటే కేవలం ప్రచారాలేనా? ప్రజల ప్రాణాలు పోతుంటే స్థానిక ఎమ్మెల్యే,అధికార పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రధాన డిమాండ్: పుంగనూరు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పేరుకే పరిమితమయ్యాయని విమర్శించారు.ఈ ఘటనలో మరణించిన యువకుడి కుటుంబానికి బీసీవై పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హెచ్చరించారు.లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరిబాబు యాదవ్ స్పష్టం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: