Sunday, 19 April 2026 04:13:35 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం

Date : 30 January 2026 06:13 PM Views : 675

Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమసత టివి న్యూస్ : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐ ఆర్ మంజూరు చేయాలని ఎస్ టి యు జిల్లా నాయకులు లింగమూర్తి,చౌడేపల్లి మండల అధ్యక్షులు వసంతమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపుమేరకు ఈరోజు సాయంత్రం చౌడేపల్లి తహశిల్దార్ పార్వతికి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మెమరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టియు నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు.ఫిబ్రవరి నెల 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.2023 జూలై నెల నుంచి 12వ పిఆర్సిని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కనీసం కమిటీని కూడా నియమించకపోవడం శోచనీయమన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ పడ్డ వేల కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల గౌరవాధ్యక్షులు ఏవి సుబ్రహ్మణ్యం,అదనపు ప్రధాన కార్యదర్శి తులసి నాగరాజ,రాష్ట్ర కౌన్సిలర్ రామకృష్ణ,మహిళా అధ్యక్షులు సుమిత్ర, మహిళా కన్వీనర్ నాగరత్నమ్మ, ఉపాధ్యక్షులు వెంకటస్వామి,మోహన్,జిల్లా కౌన్సిలర్స్ ఆంజనేయులు,అర్జున్ నాయక్,నాగరాజ, నారాయణ,మురళీమోహన్, శివ శంకర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు ఆనంద్,శివకుమార్, వరలక్ష్మి,కుసుమ కుమారి,రాజేష్,రమేష్,చెన్నకేశవులు,మనోహర్,రాణి తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :