Saturday, 13 June 2026 12:23:19 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం

Date : 30 January 2026 06:13 PM Views : 820

Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమసత టివి న్యూస్ : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐ ఆర్ మంజూరు చేయాలని ఎస్ టి యు జిల్లా నాయకులు లింగమూర్తి,చౌడేపల్లి మండల అధ్యక్షులు వసంతమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపుమేరకు ఈరోజు సాయంత్రం చౌడేపల్లి తహశిల్దార్ పార్వతికి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మెమరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టియు నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు.ఫిబ్రవరి నెల 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.2023 జూలై నెల నుంచి 12వ పిఆర్సిని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కనీసం కమిటీని కూడా నియమించకపోవడం శోచనీయమన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ పడ్డ వేల కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల గౌరవాధ్యక్షులు ఏవి సుబ్రహ్మణ్యం,అదనపు ప్రధాన కార్యదర్శి తులసి నాగరాజ,రాష్ట్ర కౌన్సిలర్ రామకృష్ణ,మహిళా అధ్యక్షులు సుమిత్ర, మహిళా కన్వీనర్ నాగరత్నమ్మ, ఉపాధ్యక్షులు వెంకటస్వామి,మోహన్,జిల్లా కౌన్సిలర్స్ ఆంజనేయులు,అర్జున్ నాయక్,నాగరాజ, నారాయణ,మురళీమోహన్, శివ శంకర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు ఆనంద్,శివకుమార్, వరలక్ష్మి,కుసుమ కుమారి,రాజేష్,రమేష్,చెన్నకేశవులు,మనోహర్,రాణి తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :