Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమసత టివి న్యూస్ : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐ ఆర్ మంజూరు చేయాలని ఎస్ టి యు జిల్లా నాయకులు లింగమూర్తి,చౌడేపల్లి మండల అధ్యక్షులు వసంతమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపుమేరకు ఈరోజు సాయంత్రం చౌడేపల్లి తహశిల్దార్ పార్వతికి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మెమరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టియు నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు.ఫిబ్రవరి నెల 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.2023 జూలై నెల నుంచి 12వ పిఆర్సిని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కనీసం కమిటీని కూడా నియమించకపోవడం శోచనీయమన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ పడ్డ వేల కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల గౌరవాధ్యక్షులు ఏవి సుబ్రహ్మణ్యం,అదనపు ప్రధాన కార్యదర్శి తులసి నాగరాజ,రాష్ట్ర కౌన్సిలర్ రామకృష్ణ,మహిళా అధ్యక్షులు సుమిత్ర, మహిళా కన్వీనర్ నాగరత్నమ్మ, ఉపాధ్యక్షులు వెంకటస్వామి,మోహన్,జిల్లా కౌన్సిలర్స్ ఆంజనేయులు,అర్జున్ నాయక్,నాగరాజ, నారాయణ,మురళీమోహన్, శివ శంకర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు ఆనంద్,శివకుమార్, వరలక్ష్మి,కుసుమ కుమారి,రాజేష్,రమేష్,చెన్నకేశవులు,మనోహర్,రాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV