Wednesday, 04 March 2026 02:18:38 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు

రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు

Date : 07 July 2023 05:22 PM Views : 333

Famous TV - భక్తి / : నాలుగేళ్ల తమ ధర్మకర్తల మండలి హయాంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం శుక్రవారం తిరుపతిలోని ఛానల్‌ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా భయపడిన సమయంలో ఈవో శ్రీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా చక్కటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారని చెప్పారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు. తద్వారా ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషితో ఛానల్‌ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. టీటీడీ సంస్థలతోపాటు సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండితులు, ప్రవచనకర్తలు, మేధావులను అనుసంధానం చేసి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. జూలై 3వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీమద్‌ భాగవతం ప్రవచనానికి విశేషమైన స్పందన వస్తోందని, యూట్యూబ్‌తోపాటు ఛానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని చెప్పారు. భక్తితోపాటు సమాజంలో మంచిని పెంపొందించడానికి జరుగుతున్న కృషిని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకుపోవడానికి ఛానల్‌ ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులు భక్తిమార్గంలో ఛానల్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. రాబోయే రోజుల్లో రూపొందించనున్న కార్యక్రమాలను వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు టీటీడీ ఛైర్మన్‌, ఈవో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డులు సభ్యులు శ్రీ నందకుమార్‌, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వసంత కవిత, సలహాదారు శ్రీ నాగదుర్గారావు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :