Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా,చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శ్యామల నవరాత్రుల్లో 8 వ రోజున అష్టమి సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి ,అభయాంజనేయ స్వామికి ,నాగభైరవ స్వామికి పంచామృత అభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.నాగ భైరవ స్వామి దగ్గర ,కుజదోషం ,సర్ప దోషం ఉన్నవారు.వివాహం కానివారు,అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పంచదీపారాధనలు సమర్పించుకున్నారు.చౌడేపల్లి , పలమనేరు,పుంగనూరు ,చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.సోమవారం ఉభయదారులుగా అమ్మరాజు పల్లి కు చెందిన శ్రీనివాసులు రెడ్డి ధర్మపత్ని రాధ,పుదిపట్ల కు చెందిన శ్రీపతి రెడ్డి ధర్మపత్ని హరితగా వ్యవహరించారు.ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Admin
Famous TV