Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు దిగువ సన్నిధి విధి నందు స్వామి అమ్మవాళ్ళ దర్శనానికి వచ్చే భక్తులకు కోసం ఎప్పుడు చేస్తున్న 50 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు భాగంగా అక్కడ ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం రావి చెట్టు మరియు అక్కడ నెలకొల్పిన నాగ శిలలు ప్రతిష్టించిన విగ్రహాలను వేరే చోట ఏర్పాటు చేసే దానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులతో చర్చించి వెనుక భాగంలో భాగంలో ఆ యొక్క నాగ శిలలును ప్రతిష్ట దానికి ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడే ఉన్న రావి చెట్టును ప్రకాశం పంతులుగారు తొలగించరాదని దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కోరుకున్నారు.దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు అనునిత్యం దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు స్వామి అమ్మవారు దర్శనానికి వస్తుంటున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దిగువ సన్నిధి వీధి నందు దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా 50 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు అందులో భాగంగా బ్రాహ్మణ సేవా సంఘం నందు నాగ శిలలను ప్రతిష్యుంచున్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు గారితో చర్చించి ఆ యొక్క నాగ శిలలను వెనుక భాగంలో దెబ్బతినకుండా ప్రతిష్టి చేస్తామన్నారు. అదేవిధంగా రావి చెట్టుని తొలగించమని తెలియజేశారు. అక్కడే ఉన్న వినాయక స్వామి దేవాలయం కూడా తొలగించి విగ్రహాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో భద్రపరిచి నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు వినాయక స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు, దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ కిషోర్ కుమార్, అర్చకులు తులసి శర్మ, పట్టణ ప్రముఖులు ధన, కళ్యాణ్, తేజ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV