Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి యూత్ హాస్టల్ లో ఏసి ఆడిటోరియం నందు ఘనంగా వేద పండితుల ఆశీస్సులు కార్యక్రమం ఆదివారం 05 జనవరి 2025 మధ్యాహ్నం 1 గంటలకు జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే లోక్ అదాలత్ ముఖ్యులు గౌరవనీయులైన యన్. సంతోష్ హెగ్డే (రిటైర్డ్)గారి చేతుల మీదుగా ప్రారంభం కాబడిన డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ అదినేత సూక్ష్మ కళాకారులు డాక్టర్ బారికి చంద్రశేఖర్ దంపతులకు వేద మంత్రాలతో, పూల అక్షింతలతో వేద పండితులు ఆశీస్సులు అందించి దీవించారు అనంతరం ఆశీస్సులు అందించిన వేద పండితులందరికి ఘనంగా సన్మానించిన డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ బారికి చంద్రశేఖర్, బెస్త పార్వతి, సభ్యులు శ్రీనివాస్, భూపతిరాజు, ప్రసన్న కుమార్ తదితరులు. అతిధులుగా దార్లపుడి శంకర గిరి శాస్త్రి గారు, లింగాల బ్రహ్మజి శర్మ గారు, రిషభ్ దీక్షిత్ గారు, భరద్వాజ శర్మగారు, సాయి కుమార్ శాస్త్రి గారు, శ్రీనివాసాచార్యులు గారు... తదితరులతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. పైడి అంకయ్య గారు ఈ కార్యక్రమాన్ని తనదైనశైలిలో గౌరవించడం జరిగింది. వేద పండితులు అందరికి డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ వారు గోమాత పురస్కారం - 2025 అందించి, సత్కరించి, గౌరవించడం జరిగింది
Admin
Famous TV