Famous TV - భక్తి / తిరుపతి : బోయకొండ గంగమ్మ కు విరాళం అందించిన భక్తులు చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని, దిగువపల్లి గ్రామములో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం ,శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు మంగళవారం రామోజీ గౌడ, మంజుల, బెంగళూరు వారు ఇరవై ఐదు వేల రూపాయలు,మాధవ రెడ్డి, రాధారాణి, మదనపల్లి వారు పదివేల రూపాయలు ఉచిత ఆన్నదాన వినియోగమునకు విరాళముగా ఇచ్చియున్నారు. వీరికి దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి ఏకాంబరం వీరికి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కలుగజేసి తీర్థ ప్రసాదములు అందజేసి సత్కరించినారు. ఈ కార్యక్రమములో దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV