Famous TV - భక్తి / తిరుపతి : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో గల అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అర్చన, అభిషేకం,వాహన పూజ, అఖండ దీపారాధన వంటి పూజలకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఈఓ రమణ మాట్లాడుతూ దేవాదాయ, దర్మాదాయ కమీషనర్ నుండి పలు రకాల సేవా టికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అర్చనకు పదిరూపాయలు, అభిషేకం కు వందరూపాయలు, అఖండ ధిపారాధన కు పదకొండు రోజులైతే ఏడువందలు, ఇరవై ఒక రోజులకు పదకొండు వందలు, నలబైనాలుగు రోజులకు రెండువేలా రెడువందలు, రుద్రాభిషేకం కు ఐదు వందలు,అలాగే వాహన పూజ ద్విచక్ర వాహనం కు నూటయాబై రూపాయలు, నాలుగు చక్రాల వాహనం కు రెండు వందల యాబై రూపాయలుగా నిర్ణయించారు. ఇవ్వన్ని శుక్రవారం నుండినే అమలు పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఐతే ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దేవాదాయ,దర్మాదాయ శాఖ వారు ఆలయం లో అర్చకత్వం నిర్వహిస్తున్న వేదపండితులకు తగిన జీవన బృతి కల్పించాలని, అలాగే దేవస్థానానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని,వాటిని దేవస్థానం అప్పగిస్తే మేము వాటిని సాగుచేసుకోవడమో, లేక కౌలుకు ఇవ్వడమో చేసి, మా కుటుంబ పోషణ చేసుకుఃటామని, దీని పై దృష్టిసారించాలని వారు తెలియజేశారు.
Admin
Famous TV