Famous TV - భక్తి / తిరుపతి : టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV