Wednesday, 29 July 2026 07:27:50 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శృంగేరి మఠం అధిపతిగా మనోహర్ !

Date : 03 April 2025 10:59 PM Views : 545

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీ శృంగేరి మఠం తిరుపతి విభాగ అధిపతిగా సామాజిక కార్యకర్త జి ఎల్ మనోహర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీరాములు వారి గుడి ఉత్తర మాడా వీధిలో ఉన్న మఠంలో జరిగిన భారతి తీర్థ స్వామి వజ్రోత్సవాలలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే గండ్ర కోట లక్ష్మీ మనోహర్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర శారదాంబ గుడిలో విశేష పూజా కార్యక్రమాలు, శంకర మఠంలో ఆది శంకరాచార్యులకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి పారాయణం జరిగింది. ప్రముఖ ప్రవచన కర్త కుప్ప విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితుల సభలు నిర్వహించినారు. ఆదిశంకరాచార్య గురు పరంపర, శృంగేరి శంకర మఠ భారతి తీర్థ స్వామి, విధు శేఖర భారతి స్వామి వార్ల గురించి విశేషంగా ప్రవచనం అందించారు. ఈ కార్యక్రమాలు ధర్మాధికారి శ్రీ రాళ్లపల్లి రామమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి. తిరుపతి శంకర మఠం మేనేజర్ నడింపల్లి కృష్ణ గారు, పూర్ణ చంద్ర సురభి మురళి పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :