Famous TV - భక్తి / తిరుపతి : సమస్య ఏదైనా అక్కడ సేవలు అందించేది పోలీసులే. ఇదే క్రమంలో చెంగాలమ్మ జాతరలో గాయపడిన ఒక అబ్బాయిని కాపాడి, మానవత్వానికి ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనం పోలీసులే అనే నినాదాన్ని చాటి, ప్రజల వద్ద ప్రశంసలు పొందారు.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చెంగాలమ్మ అమ్మవారి జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరుగుతుంది. ఈ జాతరను వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ జాతర మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తుంది. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని, సూళ్లూరుపేట పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడే ఉండి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. ఈ క్రమంలో నిన్నటి దినం సుమారు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు అనుకొని విధంగా గాలి వాన విపరీతంగా రావడంతో కరెంటు సరఫరా లేక ఆలయ ప్రాంగణం అంతా చీకటి మయం అయిపోయింది.. అదే సమయంలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఒక యువకుడు చిమ్మ చీకటిలో అనుకోకుండా ఫెన్సింగ్ నందు కాలు పెట్టడం వల్ల ఇరుక్కుని అతని పాదాలకు బలమైన గాయం కలిగి విపరీతంగా రక్తస్రావం అవడం వలన సృహ తప్పే స్థితికి వచ్చాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీస్ వారు గుర్తించి అధిక రక్త స్రావం జరగకుండా చూసి తమ పోలీసు వాహనంలో రక్త గాయాలతో బాధపడుతున్న అతనిని హుటాహుటిన ఒకపక్క జాతర అదే సమయంలో విపరీతమైన రద్దీ చిమ్మ చీకటి వీటన్నిటిని కూడా లెక్క చేయక ఒక గ్రీన్ ఛానల్ లాగా ఏర్పాటు చేసుకొని చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు...తరలించడమే కాక దగ్గరుండి ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు వచ్చేంతవరకు అతనికి సేవలందించారు.. ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రజలు పోలీసులను ప్రశంసలతో ముంచేశారు
Admin
Famous TV