Famous TV - భక్తి / తిరుపతి : తాతయ్య గుంట గంగమ్మ జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది భక్ఘులు అమ్మవారికి పొంగళ్ళు పెట్టి నైవేధ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అమ్మవారి ఆలయానికి భక్తులు, పోటెత్తారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముందుగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి శాస్త్రోక్తంగా అభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం బంగారు ముఖ కవచం, వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. చివరి రోజు కావడంతో వేలాది మంది భక్ఘులు అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Admin
Famous TV