Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. వీకెండ్ కావడం, వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం 81,833 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. టీటీడీ కూడా భక్తులు రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తోంది.. వారికి త్వరగా దర్శనం అయ్యేలా చూస్తోంది. ఈ రద్దీ జులై వరకు కొనసాగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండు రోజులుగా కొండకు భక్తులు క్యూ కట్టారు. వేసవి సెలవులు, పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో పాటూ వీకెండ్ కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.
Admin
Famous TV