Famous TV - భక్తి / చిత్తూరు : చిత్తూరు ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రమాణాలకు నిలయమైన కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో అడుగడుగునా అవినీతి,కళ్యాణ కట్ట నుండి స్వామి దర్శనం వరకు ప్రతిచోట చేతులు తడపాల్సిందే, దర్శనాలకు వెళ్ళాలంటే చేయితడపాలి,ఆలయం లోపల కు సెల్ ఫోన్లు నిషేదం ఉన్ననూ అటువంటి ఆలయం లో తనిఖీలు లేవు,అమ్యామ్యలు ముట్ట చెప్పితే ఆలయం లోకే కాదు, ఏకంగా గర్బగుడిలో దేవుడినే ఫోటో తీయవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. సెక్యూరిటీ వ్యవస్థ ఆదాయ మార్గాలకోసం చూస్తుంటే, లోపల పూజారులు వంద ఇస్తే అర్చన, ఐదువందలు ఇస్తే మంగళ హా రతి, ప్రత్యేకంగా స్వామి వారికి హారతి, ఇచ్చి మరీ పదినిమిషాలపాటు స్వామి ముందర నిల్చోవచ్చును. వీటిలో ఆలయ సిబ్బంది కి వాటాలు ఉన్నాయేమో అనే భావన కల్గుతుంది. అంతే కాదు స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు ఇచ్చేచోట పదిఇస్తే మూడుసార్లు, తీర్థం ఇచ్చి సౌభాగ్యంగా దీవించడం, లేకుంటే శాపనార్థాలు పెట్టడం, అలాగే ఇంకొంచెం ముందు ఆంజినేయ స్వామి ఆలయం లో వంద తట్టకాసులు పెడితే అర్చన, ఆశిర్వచనం, ప్రసాదం,శటగోపం తో దీవెనలు, లేక పోతే కసురుకోవడం, అలానే సిద్ది, బుద్ది సమేయ వినాయక స్వామి వారి చెంత కూడా అలానే జరుగుతుంది. ఈ విధముగా భక్తులను నిలువు దోపిడి చేస్తుంటే ఆలయ అధికారుల పర్యవేక్షణ ఎక్కడుంది, విజిలెన్స్ అధికారులు ఏమిచేస్తున్నారో అర్థం కావడం లేదు, కాణిపాకం ఆలయ పవిత్రతను మంటకల్పుతున్న సిబ్బంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుచున్నారు.
Admin
Famous TV