Wednesday, 29 July 2026 04:05:19 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పేటమిట్ట... మరో అయోధ్య

కోదండరాముడి ఆలయం రామచంద్రుడి సంకల్పం

Date : 10 February 2024 02:14 PM Views : 698

Famous TV - భక్తి / చిత్తూరు : ఇక్ష్వాకుల తిలకుడు, సూర్యవంశాన జన్మించిన శ్రీ కోదండ రాముడిని స్వగ్రామంలో కొలువుతీర్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అమర్ రాజ్య సంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు చేపట్టిన బృహత్తర కార్యం అవిష్కృతానికి మరో రెండు రోజులు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో జన్మనిచ్చిన రామచంద్రనాయుడు.. ఊరి రుణం తీర్చుకోడానికి అభివృద్ధి పనులు చేపట్టారు. అనువంశిక మైన ఆథ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. భక్తితత్వాన్ని ప్రతిబింబించడమే గాక, భక్తి సంప్రదాయాలను పునరుద్ధరణ లక్ష్యంగా.. గ్రామస్తులందరూ స్నేహపూరిత వాతావరణంతో కలిసి మెలసి ఉండే విధంగా ఆలయ సముదాయం ఉండాలని సంకల్పించారు. పదేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలలో భాగంగా గ్రామస్తులు అందరితో చర్చించి గ్రామదేవత విరూపాక్షమ్మ గుడికి చేరువగా ఉన్న గ్రామనత్తం స్థలంతోపాటు 97 సెంట్ల అదనపు స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సముదాయ నిర్మాణానికి 2019 జనవరి నెల 20వ తేదిన ఆగమోక్తంగా భూమిపూజ నిర్వహించారు. స్వంత నిధులతో పాటు ముందుకు వచ్చిన పలువురు గ్రామస్తులు భక్తితో సమర్పించిన విరాళాలతో కోదండరామస్వామి దేవాలయాన్ని నిర్మించారు. సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి కొలువై ఉండేలా ప్రధాన ఆలయం నిర్మించి, దానికి ఒకవైపు శ్రీకృష్ణమందిరం, మరోవైపు శ్రీ విఘ్నేశ్వరాలయం ఉండేలా రామాలయ సముదాయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో శిల్ప శాస్త్ర నిపుణుల సహకారంతో మహాబలిపురం నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో రూపొందించిన నిలువెత్తు స్తంభాలపై దశావతారమూర్తులను చెక్కించి ఆథ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించారు. ఆలయ ప్రాంగణంలో గ్రామం అంతా ప్రతిధ్వనించే విధంగా మ్రోగే భారీ గంటను ఏర్పాటు చేసారు. ఇక ఆలయ సముదాయంలోనే సమావేశాలు జరుపుకోడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, పండుగలు, వ్రతాల వంటి సామూహిక కార్యక్రమాలకు అనువుగా ఉండే ఎసి కమ్యూనిటీ హాలు, మధ్యలో చిన్నపిల్లలు ఆడుకోడానికి పార్కు వంటి ఏర్పాట్లు చేసారు. ఇలా పేటమిట్టను మరో అయోధ్యలా తీర్చిదిద్దడం నభూతో నభవిష్యత్ అన్న రీతిన ఉంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :