Sunday, 19 April 2026 05:35:51 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

పేటమిట్ట... మరో అయోధ్య

కోదండరాముడి ఆలయం రామచంద్రుడి సంకల్పం

Date : 10 February 2024 02:14 PM Views : 647

Famous TV - భక్తి / చిత్తూరు : ఇక్ష్వాకుల తిలకుడు, సూర్యవంశాన జన్మించిన శ్రీ కోదండ రాముడిని స్వగ్రామంలో కొలువుతీర్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అమర్ రాజ్య సంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు చేపట్టిన బృహత్తర కార్యం అవిష్కృతానికి మరో రెండు రోజులు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో జన్మనిచ్చిన రామచంద్రనాయుడు.. ఊరి రుణం తీర్చుకోడానికి అభివృద్ధి పనులు చేపట్టారు. అనువంశిక మైన ఆథ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. భక్తితత్వాన్ని ప్రతిబింబించడమే గాక, భక్తి సంప్రదాయాలను పునరుద్ధరణ లక్ష్యంగా.. గ్రామస్తులందరూ స్నేహపూరిత వాతావరణంతో కలిసి మెలసి ఉండే విధంగా ఆలయ సముదాయం ఉండాలని సంకల్పించారు. పదేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలలో భాగంగా గ్రామస్తులు అందరితో చర్చించి గ్రామదేవత విరూపాక్షమ్మ గుడికి చేరువగా ఉన్న గ్రామనత్తం స్థలంతోపాటు 97 సెంట్ల అదనపు స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సముదాయ నిర్మాణానికి 2019 జనవరి నెల 20వ తేదిన ఆగమోక్తంగా భూమిపూజ నిర్వహించారు. స్వంత నిధులతో పాటు ముందుకు వచ్చిన పలువురు గ్రామస్తులు భక్తితో సమర్పించిన విరాళాలతో కోదండరామస్వామి దేవాలయాన్ని నిర్మించారు. సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి కొలువై ఉండేలా ప్రధాన ఆలయం నిర్మించి, దానికి ఒకవైపు శ్రీకృష్ణమందిరం, మరోవైపు శ్రీ విఘ్నేశ్వరాలయం ఉండేలా రామాలయ సముదాయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో శిల్ప శాస్త్ర నిపుణుల సహకారంతో మహాబలిపురం నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో రూపొందించిన నిలువెత్తు స్తంభాలపై దశావతారమూర్తులను చెక్కించి ఆథ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించారు. ఆలయ ప్రాంగణంలో గ్రామం అంతా ప్రతిధ్వనించే విధంగా మ్రోగే భారీ గంటను ఏర్పాటు చేసారు. ఇక ఆలయ సముదాయంలోనే సమావేశాలు జరుపుకోడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, పండుగలు, వ్రతాల వంటి సామూహిక కార్యక్రమాలకు అనువుగా ఉండే ఎసి కమ్యూనిటీ హాలు, మధ్యలో చిన్నపిల్లలు ఆడుకోడానికి పార్కు వంటి ఏర్పాట్లు చేసారు. ఇలా పేటమిట్టను మరో అయోధ్యలా తీర్చిదిద్దడం నభూతో నభవిష్యత్ అన్న రీతిన ఉంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :