Famous TV - భక్తి / తిరుపతి : వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకాదశి ద్వాదశి రోజులతో పాటు మొత్తం 10 రోజులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం వుంటుంది. భారీగా భక్తులు తరలివచ్ఛే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని టోకన్ల జారీ చేయు కేంద్రాలలోని క్యూలైన్లలో తోపులాటలు జరుగకుండా, అలాగే రద్దీని క్రమబద్దికరించడానికి తగినంత పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజులే కాకుండా మొత్తం 10 రోజుల పాటు(23-12-2023 నుండి 01-01-2024 వరకూ) వైకుంఠ ద్వారం దర్శనానికి ఏర్పాట్లు చేశారని... ప్రజలు ఆత్రుత పడకుండా సహనం వహించి తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తిరుపతి నందు టోకెన్లు పొంది, ప్రశాంతమైన వాతావరణంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని టిటిడివారి నియమ నిబంధనలు, సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో నిర్మలంగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని పునీతులు కావాలని, ముఖ్యంగా భక్తులు తమ విలువైన ఆభరణాలను భద్రంగా చూసుకోవాలని అలాగే తమతో పాటు వచ్చిన పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చుసుకోవాలన్నారు. అనంతరం తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోకెన్లు జారీ చేయు కేంద్రాల వద్ద భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు క్షేత్ర స్థాయిలో పర్యటించి, కేంద్రాలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీ కులశేఖర్ శాంతి భద్రత, శ్రీమతి విమల కుమారి నేర విభాగం,శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి సాయుధ దళం, గిరిధర ఎస్బి డిఎస్పి, తిరుపతి నగర పరిధిలోని డిఎస్పిలు, సిఐలు, ఎస్ఐలు, టిటిడి విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV