Saturday, 13 June 2026 12:23:19 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - TTD

ఆన్ లైన్ లో 2025 జనవరి నెల కోటా శ్రీవారి అర్జిత సేవా టికెట్లు ,ఎలక్ట్రానిక్ డిప్ విడుదల

Date : 17 October 2024 09:58 AM Views : 932

Famous TV - భక్తి / తిరుమల స్పెషల్ : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు ఒక్కసారైనా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు ఆశపడుతుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. కొన్ని నెలలు ముందుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.

Also Read : తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులు కోర్కెలు ఎందుకు మరచిపోతారు?

టీటీడీ అధికారులు రూ. 300 రూపాయల టికెట్లు, ప్రత్యేక సేవా టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అని భక్తుల ఎదురు చూస్తుంటారు. తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు సంబంధించి 2025 జనవరి నెల కోటాను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది.

అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి జనవరి నెల కోటాను విడుదల చేస్తున్నారు. 2025 జనవరి నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ గదుల జనవరి నెల కోటాను అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 2025 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నామని, భక్తులు ఈ విషయం గమనించాలని టీటీడీ బుధవారం తెలిపింది.

HARI PRASAD

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :