Famous TV - జాతీయ వార్తలు / : అది ఓ ప్రభుత్వ కార్యాలయం. ఆ భవనం సెల్లార్లో భారీగా బంగారం, నగదు బయటపడింది. పట్టుబడ్డ నగదులో భారీగా రూ. 2000 నోట్లు ఉండటం తీవ్ర కలకలం రేపింది. రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకున్న రోజే ఈ ఘటన జరగడం లెక్కల్లోకి రాని రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారం దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. రాజస్థాన్లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారం బయటపడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జైపుర్లోని యోజనా భవన్ బేస్మెంట్లో నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు. రూ.2.31 కోట్ల నగదు, కిలో బంగారం సెల్లార్లోని తాళం వేసిన ఓ అల్మారాలో బయటపడింది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంత డబ్బు, బంగారం ఆఫీస్లోకి ఎలా వచ్చింది. దాన్ని ఎవరు తీసుకువచ్చారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని డబ్బులు, బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.
Admin
Famous TV