Famous TV - జాతీయ వార్తలు / : వినియోగదారులకి సరైన మౌళిక సదుపాయాలు లేవని ఫిర్యాదు అందుకొన్న ఎంపీ గురుమూర్తి నేడు తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డు నందు ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని పరిశీలించారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రం వద్ద వేచియున్న వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ప్రధానంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి విచ్చేస్తున్న వినియోగదారులు బయట నిలుచుకొనేందుకు షెల్టర్ లేనందు వలన ఎండ ఎక్కువగా ఉన్నపుడు కొంత మంది సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు ఉన్నాయని వర్షాకాలంలో వినియోగదారుల తీసుకువచ్చే డాకుమెంట్స్ తడిచి వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఎంపీ గురుమూర్తికి తెలియజేసారు. పాస్ పోర్ట్ కార్యాలయ అదికారులతో చర్చించిన అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి పాస్ పోర్ట్ సేవా కేంద్రం రాయలసీమ నాలుగు జిల్లాలకు విశిష్ట సేవలు అందిస్తుందని కాలనుగుణంగా రద్దీ విపరీతంగా పెరిగిందని అందుకు అనుగుణంగా మౌళిక సౌకర్యాలు మెరుగు పరచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయం గూర్చి పాస్ పోర్ట్ సేవా కేంద్రం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా మరో వారం రోజులలో రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్, టీసీఎస్ అధికారులు సంయుక్తంగా పరిశీలించి తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.
Admin
Famous TV