Thursday, 30 July 2026 07:34:34 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని పరిశీలించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం

Date : 21 August 2023 03:45 PM Views : 475

Famous TV - జాతీయ వార్తలు / : వినియోగదారులకి సరైన మౌళిక సదుపాయాలు లేవని ఫిర్యాదు అందుకొన్న ఎంపీ గురుమూర్తి నేడు తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డు నందు ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని పరిశీలించారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రం వద్ద వేచియున్న వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ప్రధానంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి విచ్చేస్తున్న వినియోగదారులు బయట నిలుచుకొనేందుకు షెల్టర్ లేనందు వలన ఎండ ఎక్కువగా ఉన్నపుడు కొంత మంది సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు ఉన్నాయని వర్షాకాలంలో వినియోగదారుల తీసుకువచ్చే డాకుమెంట్స్ తడిచి వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఎంపీ గురుమూర్తికి తెలియజేసారు. పాస్ పోర్ట్ కార్యాలయ అదికారులతో చర్చించిన అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి పాస్ పోర్ట్ సేవా కేంద్రం రాయలసీమ నాలుగు జిల్లాలకు విశిష్ట సేవలు అందిస్తుందని కాలనుగుణంగా రద్దీ విపరీతంగా పెరిగిందని అందుకు అనుగుణంగా మౌళిక సౌకర్యాలు మెరుగు పరచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయం గూర్చి పాస్ పోర్ట్ సేవా కేంద్రం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా మరో వారం రోజులలో రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్, టీసీఎస్ అధికారులు సంయుక్తంగా పరిశీలించి తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :