Famous TV - జాతీయ వార్తలు / : 105 టీఎంసీలకుగానూ.. ఉన్నది 3 టీఎంసీలే... హెచ్చెల్సీ నీటిపై ఆశతో ఇప్పటికే వరి సాగు చేసిన అనంతపురం జిల్లా రైతులు... తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు జిల్లాలో రైతులు పరిస్థితి ఆందోళనకరం ఒకవైపు వెక్కిరిస్తున్న వరుణుడు.. మరోవైపు రోజు రోజుకు అడుగంటుతున్న తుంగభద్ర జలాలు.. డెడ్ స్టోరేజీ తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీ చేరింది. 105 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం ఒక్కసారిగా డెడ్ స్టోరేజీకి చేరడం ఆందోళన కలిగిస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 1576.50 అడుగుల వద్ద కేవలం 3.003 టీఎంసీల నీరు ఉంది. డ్యాం అడుగుభాగంలోని నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఎండవేడిమి, నీటి కొరత కారణంగా చేపలు చనిపోతున్నాయి. జీవరాశులకు దాహం తీరే పరిస్థితి లేకుండాపోయింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి కొరత ఏర్పడుతోంది. జూన మొదటి వారం నుంచే వరద ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఏడాది జూలై వచ్చినా మొదలవ్వలేదు. ఎగువన 3 టీఎంసీల సామర్థ్యంలో ఏర్పాటైన తుంగ జలాశయంలోనూ నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తుంగభద్ర ఎగువన పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో కురవకపోవడం.
Admin
Famous TV