Famous TV - జాతీయ వార్తలు / : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన CSR టైమ్స్ గోల్డ్ అవార్డు 2024 నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ రంగంలో ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రముఖ సిఎస్ఆర్ టైమ్స్ సంస్థ ఈ అవార్డుని గోవా రాజ్ భవన్ లో జరిగిన 11వ నేషనల్ సిఎస్ఆర్ సమ్మిట్ కార్యక్రమంలో అందించింది. నైపుణ్యాలు మరియు జ్ఞానంతో వ్యక్తులకు సాధికారత కల్పించడంలో, మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డు నీ అందించి గౌరవించినది. రాజన్న ఫౌండేషన్ ద్వారా 2014 లో స్థాపించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 2000 నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాలలో నైపుణ్యాభివృద్ధి చేయడమే కాకుండా వారికి అమర్ రాజా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు తద్వారా ఆ నిరుద్యోగ యువత జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి, వారు స్వయం సమృద్ధిగా మారడానికి మరియు సమాజంలో గౌరవమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ "నైపుణ్యాభివృద్ధిలో మా ప్రయత్నాలను ధృవీకరించే ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది, మా కార్యక్రమాలు నైపుణ్యం అంతరాన్ని తగ్గించడం మరియు అందరికీ మరింత సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తును సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. CSR టైమ్స్ అవార్డ్ 2024 అనేది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం" అని అన్నారు. ఈ అవార్డు కార్యక్రమం గోవా రాష్ట్ర రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ జరిగింది. ఈ అవార్డు నీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మరియు రాష్ట్ర పార్లమెంటు సభ్యుడు శ్రీ సదానంద్ చేతులమీదుగా రాజన్న ఫౌండేషన్ హెడ్ సతీష్ రాళ్ళపల్లి అందుకున్నారు.
Admin
Famous TV