Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : ప్రముఖ విద్యావేత్త, పరిశోధకుడు డాక్టర్ ఎన్.బి. హర్షవర్ధన్ రెడ్డికి బ్రెయిన్ ఓ విజన్ సంస్థ శక్తి ఆచార్య జాతీయ అవార్డు ఇచ్చింది. శనివారం హైదరాబాదు టీ-హబ్ లో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025లో “శక్తి ఆచార్య” అవార్డుతో సత్కరించారు. విద్యా బోధన, వికాస శిక్షణ, పరిశోధన రంగాలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేశారు. విఐటీ యూనివర్సిటీలో ఇటీవల పిహెచ్.డి పూర్తి చేసిన హర్షవర్ధన్, 10 సంవత్సరాలకు పైగా మేనేజ్ మెంటు అధ్యాపకుడు, హెచ్ ఓ డి గా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా, సేవలందిస్తున్నారు. 20 దేశాలలో పర్యటించి పలు పరిశోధనా పత్రాలు సమర్పించారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అంతర్జాతీయ కమిషన్ ఛైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. యువత, ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ఓ విజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. హర్షవర్ధన్ విద్యారంగంలో సృజనాత్మక ఆలోచనలు, నాయకత్వ వికాసం, ప్రయోగాత్మక బోధన విధానాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డును తన గురువులు, సహచరులు, విద్యార్థులకు అంకితం చేస్తున్నానని చెప్పారు. విద్యా రంగంలో మరింత సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.
Admin
Famous TV