Wednesday, 29 July 2026 04:05:15 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఎంపీ కలిసి పులికాట్ ముఖద్వారం గూర్చి కోరిన వెంటనే కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ

Date : 29 May 2023 06:36 PM Views : 527

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీలో ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాగరమాల కార్యక్రమం కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో "తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం వద్ద పులికాట్ సరస్సులోకి సముద్ర ముఖద్వారం తెరవడం" గూర్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన వివరణాత్మక ప్రాజెక్ట్ (డిపిఆర్) పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.

పులికాట్ సరస్సు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు సరస్సు చుట్టూ నివసించే పేద మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధిని మెరుగు పరచి వారి జీవితాలలో వెలుగులు నింపెందుకు వీలైనంత త్వరగా పరిపాలనా అనుమతిని జారీ చేయమని వారిని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం సిఎస్ఎస్ కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 50:50 భాగస్వామ్య నిష్పత్తిలో చేయాలన్న కేంద్ర ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్‌ను ఆమోదించిన సంగతి ఆయనకి గుర్తు చేశారు.

ఇందుకు సమాధానంగా సదరు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పనులు మూడు శాఖల పర్యవేక్షణలో జరగనున్నాయని తెలిపారు. నేడు మత్స్యశాఖ అనుమతి కోసం పంపగా మత్స్యశాఖ అనుమతి లభించిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపనున్నామని అన్ని అనుమతులు లభించిన పిదప టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని ఆయన చెప్పారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :