Sunday, 19 April 2026 05:35:47 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఎంపీ కలిసి పులికాట్ ముఖద్వారం గూర్చి కోరిన వెంటనే కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ

Date : 29 May 2023 06:36 PM Views : 486

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీలో ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాగరమాల కార్యక్రమం కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో "తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం వద్ద పులికాట్ సరస్సులోకి సముద్ర ముఖద్వారం తెరవడం" గూర్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన వివరణాత్మక ప్రాజెక్ట్ (డిపిఆర్) పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.

పులికాట్ సరస్సు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు సరస్సు చుట్టూ నివసించే పేద మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధిని మెరుగు పరచి వారి జీవితాలలో వెలుగులు నింపెందుకు వీలైనంత త్వరగా పరిపాలనా అనుమతిని జారీ చేయమని వారిని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం సిఎస్ఎస్ కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 50:50 భాగస్వామ్య నిష్పత్తిలో చేయాలన్న కేంద్ర ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్‌ను ఆమోదించిన సంగతి ఆయనకి గుర్తు చేశారు.

ఇందుకు సమాధానంగా సదరు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పనులు మూడు శాఖల పర్యవేక్షణలో జరగనున్నాయని తెలిపారు. నేడు మత్స్యశాఖ అనుమతి కోసం పంపగా మత్స్యశాఖ అనుమతి లభించిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపనున్నామని అన్ని అనుమతులు లభించిన పిదప టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని ఆయన చెప్పారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :